హిట్ సినిమాలో నటిస్తే ఆఫర్లు వాటంతట అవే వస్తాయి. సక్సెస్ అనేది ఎవరికైనా అలా గుర్తింపు తెచ్చేస్తుంది. ఇటీవల విడుదలైన 'పటాస్' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన పంజాబీ భామ శ్రుతి సోధి కూడా అలాగే టాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ సినిమా కమిట్ అయింది. యువ కథానాయకుడు ఆది సరసన నటించే ఛాన్స్ పొందింది. వీరభద్రం చౌదరి రూపొందించే చిత్రానికి గాను ఆది పక్కన ఈ చిన్నదానిని కథానాయికగా ఎంచుకున్నారు. అనిల్ సుంకర నిర్మించే ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది.
adi, shrutisodhi, veerabhadram, tollywood, news,