అఖిల్? సినిమాతో తెలుగు పరిశ్రమకు అక్కినేని వంశం నుంచి అఖిల్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక అదే సినిమాతో సయేషా పేరుతో మరో స్టార్ వారసురాలు కూడా పరిచయం అయ్యారు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సయేషా, అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కాగా ఆ సినిమా అనుకున్నంతగా మెప్పించకపోవడంతో ఆమె, వెంటనే బాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ శివాయ్ అనే సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
దీపావళికి విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సయేషా ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమా వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. శివాయ్ షూటింగ్ సమయంలో తెలుగు నుంచి పలు అవకాశాలు వచ్చినా వాటిని పక్కనబెట్టిన ఆమె, తెలుగులో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తానా అని ఎదురుచూస్తున్నారట. తెలుగులో ఆమెకు ప్రస్తుతం పలు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని, అందులో ఒకటి త్వరలోనే ఖరారవుతుందని తెలిసింది. ఇదిలా ఉంటే ఈమధ్యే జరిగిన సైమా వేడుకలో ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చి సయేషా చిరంజీవి మన్ననలు కూడా పొందడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్తో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు