ప్రస్తుతం ఎంత మంది యువ హీరోలు ఉన్నా నవ మన్మధుడు ఎవరంటే? వెంటనే గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జున. వయసుతో సంబంధం లేకుండా అన్ని తరహా పాత్రలను చేస్తూ మెప్పిస్తున్నా ఆయన ఓ వైపు బిజినెస్ ను మరో వైపు సినిమా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా తన కుమారులు గురించి కూడా నాగ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
రీసెంట్ గా చైతు ని కాస్త గాడిలో పెట్టిన నాగార్జున తన రెండవ కుమారుడు అఖిల్ సినిమాలపై కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టాడు. మనం సినిమా దర్శకుడైన విక్రమ్ కె కుమార్ తో ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న అఖిల్ నాన్న సలహాలు చాలా వరకు తీసుకుంటున్నాడట. అన్నపూర్ణ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడా రాజి పడకుండా అఖిల్ రెండవ సినిమాని రిచ్ గా ప్రెజంట్ చేస్తున్నారట. అయితే ఇంతవరకు ఈ సినిమా టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని రిలీజ్ చేయలేదు. దీంతో నాగ్ రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో రంగుల రాట్నం అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అఖిల్ సినీ కెరీర్ కు తప్పకుండా బూస్ట్ ని ఇస్తుందని నమ్మకంతో ఉన్నారట నాగ్. అయితే రంగుల రాట్నం అనే టైటిల్ అఖిల్ సినిమాకే ఫిక్స్ చేశారా అనేది ఇంకా అధికారికంగా వెలువడలేదు.