మలయాళ నటి భావనకు ఎదురైన సంఘటన విషయంలో అనుమానాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అసలీ ఉదంతమే సహజంగా లేదంటూ తన ఉద్దేశ్యాన్ని ఓపెన్ లెటర్ ద్వారా తెలియపరిచింది మంచు లక్ష్మి. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది.
'ఈ సంఘటన నన్ను మరింత బాధాకరంగా మార్చేసింది. అసలు ఈ ఉదంతం.. నాకు అసహజంగా కనిపిస్తోంది. భయపెట్టే సినిమాల్లో మాదిరిగా ఉంది తప్ప.. రియల్ లైఫ్ లో ఇలాంటివి ఊహించలేం. రోడ్డు మీద నడిచే ప్రతీ వారికీ ఇలాంటి సంఘటనలు ఎదురుకావడం అనేది నిజంగా షాక్ కలిగించే విషయమే. ఎవరిని ఈ విషయంపై ప్రశ్నించాలి.. ఏమి ప్రశ్నించాలి' అనే అంశాలు నా మైండ్ లో ఇంకా ప్రశ్నలు గానే మిగిలిపోయాయి అని అంటోంది ఆలియా భట్.
ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా ఎదురుకావచ్చు.. కానీ ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువగా నేను మాట్లాడను. బహుశా ఇదే ఆఖరుసారి అంటూ ఈ సంఘటనపై ఇప్పుడ దేశం అంతా స్పందిస్తోందని. అంటోంది ఆలియా భట్.