ఆమధ్య అంజలి కథానాయికగా వచ్చిన 'గీతాంజలి' చిత్రం మంచి హిట్టయిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తున్నారు. అయితే, కథానాయిక మాత్రం మారిపోయింది. పారితోషికం విషయంలో అంజలి బెట్టు చేయడంతో, ఆమెను డ్రాప్ చేసుకుని తాజాగా స్వాతిని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'గీతాంజలి'కి దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, అంజలితో బాటు రచయిత కోన వెంకట్ కూడా ఈ సీక్వెల్ కి పనిచేయడం లేదు!
coloursswathi, anjali, sequel, tollywood, news,