అల్లరి నరేష్ హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి రూపొందిస్తున్న 'బందిపోటు' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 11న హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తారు. ఈవీవీ సినిమా బ్యానర్ పై దీనిని రాజేష్ ఈదర (ఆర్యన్ రాజేష్) నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రాజేష్ చెబుతూ, "2000 సంవత్సరంలో నాన్నగారు ఈ బ్యానర్ ను నెలకొల్పారు. నాన్నగారి పేరు మీదున్న ఈ సంస్థపై ప్రెస్టేజియస్ సినిమాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ క్రమంలో మా బ్యానర్ వాల్యూ పెరిగే విధంగా ఈ 'బందిపోటు' తొమ్మిదవ చిత్రంగా వస్తోంది. ఈ 11న ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో గ్రాండుగా నిర్వహిస్తున్నాం" అన్నారు.
allarinaresh, bandipotu, aryanrajesh, audiorelease,