స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ?సరైనోడు? సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. భోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్కు సంబంధించిన ఆడియో ఈమధ్యే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక సినిమా విడుదలకు ఇంకా ఐదురోజులే ఉండడంతో టీమ్ ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే వేగవంతం చేసేసింది. వారం క్రితమే వైజాగ్లో చేపట్టిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ కాగా అదేరోజు నుంచి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం సంగీత దర్శకుడు థమన్ సినిమా గురించి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇక నేటినుంచి హీరో బన్నీ, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్లతో పాటు దర్శకుడు శీను సైతం ప్రచార కార్యక్రమాల్లో మమేకం కానున్నారు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఇప్పటికే తారాస్థాయిని చేరుకున్నాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బన్నీని పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేస్తుందన్న ప్రచారం పొందుతోంది.