ఎప్పటినుండి దర్శకుడు అవ్వాలని అనుకుంటున్న ఈ రైటర్ కల ఎట్టకేలకు నెరవేరింది. ముందులో ఎన్టీఆర్ తనను దర్శకుడిగా పరిచయం చేస్తాడని చాన్నళ్ళు వెయిట్ చేశాడు కాని.. చివరకు వక్కంతం వంశీకి నిరాశ తప్పలేదు. ఇప్పుడు ఫైనల్ గా అల్లు అర్జున్ ను తాను తొలిసారిగా డైరక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాను ఈరోజు లాంచ్ చేశారు.
అల్లు అర్జున్ హీరోగా.. ఇప్పుడు రేసుగుర్రం సినిమాకు కథ రాసిన వక్కంతం వంశీ డైరక్టర్ గా.. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో.. నా పేరు సూర్య అనే సినిమా మొదలైంది. ఈ సినిమాకు నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్. మొన్నటివరకు బన్నీకి ఈ టైటిల్ ఇష్టం లేదని.. అందుకే ఇప్పుడు ఈ టైటిల్ ను మారుస్తున్నారని ఎన్నో రూమర్లు వచ్చాయి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు అదే టైటిల్ తో ఏకంగా లోగో లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మొన్నామధ్యన డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు కూడా మూవీ ప్రారంభోత్సవం నాడే టైటిల్ లోగోను రిలీజ్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు తదుపరి సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయిపోతున్నాడు.
ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త సినిమా డిజె దువ్వాడ జగన్నాథమ్ జూన్ 23న రిలీజ్ కు సిద్దంగా ఉంది.