సర్రైనోడు చిత్రం తర్వాత అల్లు అర్జున్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తాడని ఆ మధ్య వార్తలు తెగ ప్రచారం అయ్యాయి..సెట్స్ ఫైకి కూడా వెళ్లబోతుందని అందరూ అనుకున్నారు. కానీ సడెన్ గా విక్రమ్ కు షాక్ ఇచ్చి బన్నీ హరీష్ శంకర్ తో డీజే (దువ్వాడ జగన్నాధం ) కు ఒకే చెప్పాడు..ఆ తర్వాత బన్నీ కి విక్రమ్ కుమార్ కథ నచ్చలేదు కావొచ్చని అనుకున్నారు. వాస్తవానికి అక్కినేని అఖిల్ కోసం బన్నీ విక్రమ్ సినిమాని వదులుకున్నాడని టాక్.
మొదటి చిత్రం ప్లాప్ తో నెక్స్ట్ ఏ సినిమా చేయాలి..ఎవరితో చేయాలి అనే అయోమయం లో ఉన్న అఖిల్ , తనను వెండి తెరకు పరిచయం చేసిన విక్రమ్ అయితేనే కరెక్ట్ అని భావించాడట. కాకపోతే అప్పటికే విక్రమ్ , బన్నీ తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. ఈ క్రమంలో విక్రమ్ని పిలిచి అఖిల్ కోసం ఏమైనా స్టోరీ ఉంటే చేద్దామని నాగార్జున అడగడం, బన్నీకి అభ్యంతరం లేకపోతే అఖిల్తో సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధమేనంటూ చెప్పాడట ఆ దర్శకుడు. దీంతో బన్నీ సరే నువ్వు అఖిల్ తో చేయే అని చెప్పడం తో అఖిల్ చిత్రానికి విక్రమ్ ఒకే చెప్పాడట.