Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2016 16:41:48
facebook Twitter Googleplus
Photo

అల్లు శిరీష్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి 1971- బియాండ్ బోర్డర్స్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదలైన దగ్గర్నుంచి శిరీష్ లోని దేశభక్తి మెల్లగా బయటపడుతోంది. మేజర్ రవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లోని అరుణ్ ఘర్ ఆర్మీ బేస్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో తనకు రోల్ రావడానికి తన దేశ భక్తి కూడా ఒక కారణమని చెప్పిన శిరీష్ ఇప్పుడు ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా ఆర్మీ బేస్ క్యాంపులోని సైనికుల నుండి తనకు కలిగిన అనుభవాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
?సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఈ షూటింగ్లో దేశం, యుద్ధం, చరిత్ర గురించి చాలా నేర్చుకున్నాను. ఈ అనుభవం చాలా గొప్పది. మన దేశం జవాన్లకు చాలా రుణపడి ఉంది. తట్టుకోలేని వాతావరణం, తక్కువ రిసోర్సెస్, వ్యక్తిగత జీవితం లేదు. అయినా వాళ్ళు దేశం కోసం నిస్వార్థంగా పని చేస్తున్నారు. వాళ్ళే నిజమైన హీరోలు? అంటూ సైనికుల గొప్పతనాన్ని భావోద్వేగంగా తెలిపాడు. ఇకపోతే ఈ సినిమాలో శిరీష్ వార్ ట్యాంక్ కమాండర్ గా కనిపించనున్నాడు.

,  ,  ,  ,