తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, ఇక నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాకి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తుంది. ప్రకాశ్ రాజ్ .. శ్రేయా రెడ్డి ప్రధాన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాతో ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.
గతంలో ప్రియదర్శన్ .. ప్రకాశ్ రాజ్ కాంబినేషన్లో వచ్చిన 'కాంజివరం' చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా తప్పనిసరిగా తనకి నిర్మాతగా సక్సెస్ ని ఇస్తుందనే ఉద్దేశంతో, అమలాపాల్ సొంత బ్యానర్ ని స్థాపించి రంగంలోకి దిగుతోంది. మరి నిర్మాతగా ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.