మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు సీజర్ 2 రేపటి నుండి స్టార్ మా ఛానెల్ లో సాయంత్రం 9: 30లకు మొదలుకానుంది. ఈసందర్బంగా ఈరోజు జరిగిన స్టార్ మా లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి ఈ షో గురించి చాలా విశేషాలు తెలిపారు. అలాగే షో చేస్తున్నప్పుడు తనకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ గురించి కూడా ప్రస్తావించారు. ?ఈ షో నా వద్దకు రాగానే నేను ముందు అయిష్టంగానే ఉన్నాను. తర్వాత నాగార్జునకు ఫోన్ చేసి నన్నిలా అడుగుతున్నారు, నేనేమో అయిష్టంగా ఉన్నాను అంటే.. వెంటనే నాగార్జున లేదు మీరు చెయ్యాలి. అప్పుడే ప్రోగ్రామ్ నెక్స్ట్ లెవల్ కు వెళుతుందని చెప్పాడు?.
అలా షో స్టార్ట్ చేసిన నాకు ప్రోగ్రామ్ చీఫ్ సిద్దార్థ్ బసు షో చాలా బాగా వస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఒక వేడుకలో మితాబ్ గారిని కలిసినప్పుడు ఏమిటి మీరు చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో చాలా బాగా వస్తోందట కదా. సిద్దార్థ్ బసు చెప్పారు. అలాగే చేయండి అన్నారు. ఆయనంతటి వ్యక్తి అలా చెప్పడం నాకో పెద్ద సర్టిఫికెట్ లా ఫీలవుతున్నాను అంటూ అనుభవాలను పంచుకున్నారు. అలాగే షోకి ఎవరెవరు వస్తారో చెప్పి తన మిత్రుడు బాలకృష్ణను కూడా ఆహ్వానిస్తానని అన్నారు.