జూనియర్ ఎన్టీఆర్ కనిపించేది ఓ రెండు రోజులు మాత్రమే. కాని మిగతా రోజులంతా ఆ షోలో ఉన్న కంటెస్టంట్లే నెట్టుకురావాలి. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు వర్షన్ ను మరింత రంజింపచేయడానికి మనోళ్ళు కొత్త కంటెస్టంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలకి పంపిస్తారని టాక్ వచ్చంది. ఇందులో ప్రముఖంగా హాట్ యాంకర్లైన అనసూయ మరియు రష్మి పేర్లు వినిపించాయి.
అయితే ఈ బిగ్ బాస్ అంటేనే కాస్త పేరున్న సెలబ్రిటీలు కంగారుపడుతున్నారు. ఎందుకంటే అక్కడ మేకప్ లేకుండా కనిపించాలి అలాగే ఒరిజినల్ గా ఎలా ఉంటారో కూడా తెలిసిపోతుంది. అందుకే చాలామంది ఈ అవకాశాన్ని వద్దని అంటున్నారట. ఇప్పుడు అనసూయ కూడా నో చెప్పేసింది. నాకు నా సినిమా కమిట్మెంట్లు.. యాంకరింగ్ వలన.. చాలా బిజీగా ఉన్నాను. అసలు డేట్లు ఖాళీగా లేవు. కాబట్టి బిగ్ బాస్ చేయలేను అంటూ చెప్పేసింది అనసూయ. అయితే బిగ్ బాస్ లో ఉన్నోళ్ళందరూ ఖాళీగా ఉన్నవారేనా అనసూయా? కాదులే బేబి.
ఇకపోతే పోసాని అండ్ రష్మి కూడా ఈ బిగ్ బాస్ కు నో చెప్పేసినట్లు టాక్ వస్తోంది. కాకపోతే మరో ఇద్దరు సెలబ్రిటీలతో ఇప్పుడు బిగ్ బాస్ వారు సంప్రదింపులు జరుపుతున్నారట. కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి ఒప్పించేందుకు కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.