డీజే- దువ్వాడ జగన్నాధం మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్. మే నెలలో జరిగే షెడ్యూల్ తో డీజే షూటింగ్ పూర్తయిపోతుంది. ఇప్పటికే తన తర్వాతి సినిమాను కూడా అనౌన్స్ చేసేశాడు అల్లు అర్జున్. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే మూవీకి నా పేరు సూర్య అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా.. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జెంటిల్మన్ హీరో.. అర్జున్ విలన్ పాత్రలో నటిస్తున్నాడనే టాక్ వినిపించింది.
అయితే... ఈ మూవీలో అర్జున్ చేస్తున్నది విలన్ పాత్ర కాదట. అల్లు అర్జున్ కి తండ్రి పాత్రలో అర్జున్ కనిపించనున్నాడని తెలుస్తోంది. తండ్రి పాత్ర గురించిన ఆఫర్ రాగానే.. అర్జున్ మొదట తిరస్కరించాడట. తాను తండ్రి పాత్రలను ఇప్పుడే చేయబోవడం లేదని ఈ 52ఏళ్ల నటుడు చెప్పాడట. కానీ అల్లు అరవింద్ స్వయంగా అర్జున్ కి కాల్ చేసి ఒప్పించాడని తెలుస్తోంది. ఈ మూవీలో తండ్రి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని.. మూవీలో హీరో పాత్రకు సమానంగా ప్రాధాన్యత దక్కుతుందని చెప్పాడట అల్లు అరవింద్.