బాహుబలి 2 మోత మొదలైంది. బహుబలి సీక్వెల్ పై ప్రేక్షకులపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందుకోసం యేడాదిన్నరగా వెయిట్ చేస్తున్నారు. బహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? పార్టు2లో తెలియనుండటం.. ప్రేక్షకుల ఆసక్తికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావొస్తొన్న బాహుబలి2 వచ్చే యేడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది.
ఇప్పటికే బాహుబలి 2 బిజినెస్ రూ. 400కోట్లు దాటినట్టు సమాచారమ్. ఇంకా చాలా ఏరియాల్లో బిజినెస్ అలాగే మిగిలింది. ఇటీవలే చెన్నై బాహుబలి రైట్స్? రూ. 54కోట్లకి అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. మిగితా ఏరియాల బిజినెస్ కూడా తోడైతే.. బాహుబలి కంటే ఎక్కువ బిజినెస్ సీక్వెల్ కి అయ్యేలా ఉంది.
రాజమౌళీ దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలిలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా,రమ్య కృష్ణ, సత్యరాజ్? తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి.