వందో సినిమా తరవాత కూడా బాలకృష్ణ వేగంగా సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ వెంటనే 101వ చిత్రమూ పట్టాలెక్కిస్తారట. ఆ సినిమా దాదాపుగా కృష్ణవంశీతోనే అన్నది లేటెస్ట్ టాక్.
బాలకృష్ణ ? కృష్ణవంశీల కలయికలో వందో చిత్రంగా ?రైతురాజ్యం? అనే సినిమా తెరకెక్కాల్సింది. అయితే కృష్ణవంశీ స్థానం లో అనూహ్యంగా క్రిష్ వచ్చాడు. అయినా సరే? కృష్ణవంశీతో తాను అనుకొన్న ప్రాజెక్టుని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానంటున్నాడట బాలయ్య. రైతు కథ బాలయ్యకు అంతగా నచ్చిందని, అందుకే కృష్ణవంశీ తో రైతు కథని 101వ సినిమాగా బాలయ్య తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడని విశ్వసనీయ వర్గాల మాట.
ప్రస్తుతం నక్సిత్రంతో బిజీగా వున్నారు కృష్ణ వంశీ. ఈ సినిమా పూర్తికావచ్చింది. దీని తర్వాత బాలయ్య సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారని తెలిసింది