ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రసవత్తరమైన పోటీ కనబడనుంది. చాన్నాళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. చిరు తన 150వ సినిమా ఖైధీ నెం 150 వస్తుంటే బాలయ్య తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తో రానున్నాడు. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో, సినీ జనాల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల చిత్రీకరణ దాదాపు పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్లు కూడా దగ్గరపడుతుండటంతో ఆయా టీమ్ లు ప్రమోషన్లపై దృష్టి పెడుతున్నాయి.
ఎవరికి వారు వైవిధ్యమైన రీతిలో ప్రమోషన్లు చేయాలని కొత్త కొత్త ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ల రేస్ లో బాలకృష్ణ చిరంజీవి కన్నా ఒక అడుగు ముందే ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎందుకంటే చిరు కేవళంఫస్ట్ లూకా మాత్రమే రిలీజ్ చేయగా బాలయ్య టీజర్ ను రిలీజ్ చేసి మంచి స్పందన రాబట్టుకున్నాడు. పైగా యాత్రలు, పూజలు పేరుతో నిత్యం మీడియాలో సినిమా ప్రస్తావించబడుతోంది. అలాగే థియేట్రికల్ ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్లను ప్రకటించి వాటి కోసం ముఖ్యమంత్రి, మంత్రులను ఆహ్వానించాలని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ చిరు మాత్రం ఇప్పటిదాకా ఖైధీ నెం 150 ట్రైలర్ రిలీజ్ డేట్ గాని, ఆడియో వేడుక వివరాలు గాని ఒక్కటి కూడా చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే చిరు కన్నా బాలయ్య ఒక అడుగు ముందున్నాడనే అనిపిస్తోంది. మరి చిరు బాలయ్యతో సమానంగా ప్రమోషన్లు ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి