బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే చాలు.. నందమూరి ఫ్యాన్స్ లో బోలెడంత ఉత్సాహం వచ్చేస్తుంది. సింహ.. లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన కాంబో కావడంతో.. వీరిద్దరూ కలిసి చేసే మరుసటి చిత్రం కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బాలయ్య వందో చిత్రాన్నే బోయపాటితో తీయాలని కోరుకున్నారు కూడా.
కానీ ఈ ప్రాజెక్టు ఇప్పటివరకూ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. బోయపాటి-బాలయ్యలు ఇద్దరూ కలిసి మరో సినిమా చేసేందుకు సై అనేసుకున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా ఓకే అయిపోయింది. పొలిటికల్ యాంగిల్ లో ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 2018 అక్టోబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. 2019 మార్చ్ రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకుని ఈ సినిమాను పూర్తి చేస్తారని తెలుస్తోంది. అదే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ఈ సినిమా లైన్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
జనవరి నుంచి రామ్ చరణ్ తో సినిమా ప్రారంభించనున్న బోయపాటి.. జూన్ నాటికి ఆ చిత్రాన్ని పూర్తి చేసి.. వెంటనే బాలయ్య సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తాడట.