తెలుగు సినీ పరిశ్రమలో మాస్ ఆడియన్స్ లో తనకున్న క్రేజ్ మరెవ్వరికీ లేదని అంటున్నాడు నందమూరి బాలకృష్ణ. తనకున్న ఆ క్రేజ్ అంతా తన కొడుకు మోక్షజ్నకి కూడా ఆటోమేటిగ్గా వస్తుందని.. దాన్ని కాపాడుకుని ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవడం అతను చేయాల్సిందల్లా అని బాలయ్య చెప్పాడు. మోక్షజ్న తెరంగేట్రం గురించి బాలయ్య ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
??నా వారసుడిగా మోక్షజ్న త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తాడు. తనను ఎలాంటి సినిమాతో పరిచయం చేయాలో నాకు బాగా తెలుసు. తన కోసం రెండు మూడు కథలు నా మనసులో ఉన్నాయి. ఐతే తొలి సినిమాతోనే మోక్షజ్నతో ఏదేదో చేయించాలని నాకు లేదు. తనను సూపర్ హీరోగా చూపించాలని అనుకోవట్లేదు. మాస్ లో నాకున్న క్రేజ్ మరే హీరోకూ లేదు. కాబట్టి మోక్షజ్నకి కూడా అది వస్తుంది. అతను చేయాల్సిందల్లా ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవడమే. జనాలు నన్ను తమవాడిగా భావిస్తారు. నాపై వాళ్లకు హక్కుందని అనుకుంటారు. నన్ను ఓ కథానాయకుడిగా కంటే వాళ్ల మనిషిలా భావిస్తారు. అందుకే నేను జనం మధ్యకు వెళ్లి ధైర్యంగా షూటింగ్ చేయగలుగుతా. మోక్షజ్న కూడా నాలా జనానికి దగ్గర కావాలి. మోక్షజ్న తొలి సినిమా గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తా?? అని బాలయ్య చెప్పాడు.