బాలయ్య కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ వందో చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి" షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన లొకేషన్ ఫోటొలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోల్లో హీరోయిన్ శ్రియాతో కలిసి బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొన్న సన్నివేశాలు చూసిన ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో బాలయ్య భార్యగా శ్రియ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే తనకెంతో సెంటిమెంట్ అయిన సంక్రాంతి బరిలోకి రావాలని బాలయ్య ఇప్పటికే ప్లాన్ చేయడంతో.. పండుగ దగ్గర పడుతున్నకొద్దీ ఈ సినిమా విడుదలకోసం బాలయ్య ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ తెలంగాణా ముఖ్యమంత్రులకు తన సినిమాని స్పెషల్ షో వేసి చూపించడానికి బాలయ్య రెడీ అయినట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అనవసరమైన సన్నివేశాలను జొప్పించకుండా సాధ్యమైనంతవరకు క్రిస్పీగా ఉండేలా చూసే క్రమంలో ఈ సినిమాను సుమారు 130 నిమిషాలకు సెట్ చేయాలని క్రిష్ ఆలోచిస్తున్నాడట. కాగా వీటిలో దాదాపు 40 నిముషాలపాటు వీ.ఎఫ్.ఎక్స్. ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తోంది.