సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలయికలో వస్తోన్న సినిమా ?బ్రహ్మోత్సవం?. ఒక్క పాట మినహా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ?మధురం.. మధురం? సాంగ్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. అలాగే మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ?బ్రహ్మోత్సవం? ఆడియోను మే 7 న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఎంతో క్రేజ్ ఉన్న ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ అయిన అభిషేక్ పిక్చర్స్ స్వంతం చేసుకున్నట్లు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం నైజాం ?బ్రహ్మాత్సవం? హక్కులను 21 కోట్లకు అభిషేక్ పిక్చర్స్ స్వంతం చేసుకున్నట్లు తెలిసింది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 20 న భారీ స్థాయిలో విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది.