తమిళ హిట్ మూవీ తనీ ఒరువన్ కు రీమేక్ గా రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ధృవ దసరాకి కాకుండా డిసెంబర్ నెలకు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. మేకింగ్ లో ఎటువంటి పొరపాట్లు జగకుండా కావలసినంత టైమ్ తీసుకుని సినిమాని సంతృప్తికరంగా రూపొందించాలని సినిమాను వాయిదా వేశారు. అలాగే చిత్రంలో విలన్ గా నటిస్తున్న అరవింద స్వామికి ఆరోగ్యం బాగోలేకపోవడం కూడా ఈ వాయిదాకు మరో కారణం.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో అరవింద స్వామి కూడా పాల్గొంటున్నారు. ఇక్కడే అరవింద స్వామి, రామ్ చరణ్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమిళ వర్షెన్ లో కూడా అరవింద స్వామి విలన్ గా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రేసు గుర్రం ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది