ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాధ్ తన కెరీర్ మొత్తం మీద బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. గతంలో కూడా హిట్లు ఫ్లాపులు ఉన్నా.. మరీ స్టార్ హీరోలు మొహం చాటేసే పరిస్థితిని ఎప్పడూ ఎదుర్కోవాల్సి రాలేదు. కుర్ర హీరోలకు హిట్స్ ఇవ్వలేకపోవడంతో.. పూరీతో సినిమాలకు చాలామంది వెనకాడుతున్నారు.
ప్రస్తుతం పూరీ చేతిలో ఉన్న సినిమా రోగ్ ఒక్కటే. నిర్మాత సీఆర్ మనోహర్ కొడుకు ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తున్న ఈ మూవీ.. సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉన్న పూరీ.. తన ఫ్రెండ్ కం గతంలో కో ప్రొడ్యూసర్ అయిన ఛార్మిని పిలిచాడు. పబ్లిసిటీకి సంబంధించిన యాక్టివిటీస్ చూసుకోమని ఛార్మిని కోరాడట పూరీ.
ఇలా పూరీ నుంచి మాట రావడం ఆలస్యం.. రంగంలోకి దిగిపోయిందట జ్యోతిలక్ష్మి యాక్ట్రెస్. తన పీఆర్ టీంతో కలిసి ప్లాన్స్ గీసేస్తోందట. కొత్త హీరోలు.. హీరోయిన్లను పరిచయం చేయడంలో పూరీ ట్రాక్ రికార్డ్ ను బేస్ చేసుకుని.. ఛార్మీ కేంపెయిన్ నడవనుందని టాక్ వినిపిస్తోంది. మరి ఛార్మి ఐడియాలు రోగ్ కు ఏ మాత్రం హెల్ప్ అవుతాయో చూడాలి.