మెగాస్టార్ చిరంజీవి తన కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ఇచ్చిన జోష్ తో ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరోవైపు రీసెంట్ గా బుల్లితెర అరంగేట్రం చేసి.. అక్కడ కూడా సత్తా చాటేస్తున్నారు. తన స్టైల్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు డీల్ చేస్తున్న విధానం.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు చిరు తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టేశారని తెలుస్తోంది.
మెగా 151గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అంతే. అయితే.. ఖైదీ నంబర్ 150 సక్సెస్ మీట్ నిర్వహిద్దామని భావించి చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. తన నెక్ట్స్ మూవీని ఏప్రిల్ లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న చిరు.. మెగా ఫ్యాన్స్ కోసం 151వ సినిమా లాంఛింగ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారట. ఏప్రిల్ లో ఈ లాంఛింగ్ కార్యక్రమం పూర్తి చేసి.. మే నెలలో మూవీ షూటింగ్ ప్రారంభించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఉయ్యాలవాడ స్క్రిప్ట్ కు తన స్టైల్ టచెస్ ఇవ్వడంలో బిజీగా ఉన్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ చిత్రానికి కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనుండగా.. కేవలం నిర్మాణం కోసం 80 కోట్లు బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది.