ఆయన ఇతరుల ఆడియో ఫంక్షన్లలో ఎన్నిసెటైర్లు వేసినా.. ఎవరిని ఎలా టీజ్ చేసినా.. పంచులు విసిరినా.. అసలు ఆయన మీడియా మైక్ ముందు మాట్లాడితేనే ఒక కిక్ ఉంటుంది. అటువంటి దాసరి వారు కొన్నాళ్ళ నుండి మీడియాకు దూరమైయ్యారు. తీవ్ర అస్వస్థత రావడంతో ఆయన కొన్నాళ్ళు ఐసియు లో ఉన్నారు. ఆ తరువాత బయట పబ్లిక్ లోకి రావడమే మానేశారు.
ఇకపోతే గత సాయంత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి మరియు నటుడు మోహన్ బాబు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన్ను పూల మాలలతో సత్కరించి.. ఆయనతో కాసేపు మాటామంతి జరిపారు. అంతేనా.. మీడియాతో కూడా మాట్టాడేశారు. ఇక ఈ కార్యక్రమంలో దాసరిని చూస్తే.. ఆయన కాస్త సన్నబడ్డారనే చెప్పాలి. కాకపోతే ఉత్సాహంగా ఉన్నారు. ఏదేమైనా కూడా ఆయన్ను అలా ఆనందంగా చూస్తుంటే మాత్రం.. ఒక్కసారి తెలుగు కళామతల్లి కూడా చాలా ఖుషీ అయిపోతుంది అంతే. దర్శకుడు అనే వాడిని స్టార్ ను చేసిన ఘనత దాసరిదే. అందుకే ఆయనంటే అందరికీ అటువంటి ప్రత్యేక అభిమానం. అందుకే ఆయన్ను ఆనందంగా అలా చూస్తుంటే అందరికీ ఇంకా ఆనందంగా ఉంది.
ఈ సందర్భంగా మొన్న ప్రకటించిన అల్లు మెమోరియల్ అవార్డ్ ను దాసరికి అందించారు చిరంజీవి. మార్చి15న జరగాల్సిన ఈ ఈవెంట్ దాసరి అనారోగ్యం కారణంగా వాయిదా వేశారు.