చెన్నయ్ సుందరి సమంతా తమిళంలో జోరు పెంచేసింది. ఇటు తెలుగు సినిమాలు తగ్గించుకుంటూ కోలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో అక్కడి పాప్యులర్ హీరోలందరితోనూ సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం విక్రం, విజయ్ సరసన చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో ధనుష్ తో కూడా జతకట్టనుంది. ధనుష్ తో ఇటీవల VIP చిత్రాన్ని నిర్మించిన యూనిట్ ఆయనతోనే మరో చిత్రాన్ని తీయడానికి ప్లాన్ చేస్తోంది. దీనికి కూడా వేల్ రాజ్ దర్శకత్వం వహిస్తాడు. ఇందులో ప్రధాన నాయికగా సమంతాను తీసుకున్నారు. ప్రస్తుతం తను ఈ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేస్తోంది. ఇందులో మరో నాయికగా ఎమీ జాక్సన్ నటిస్తుంది.
dhanush, samantha, kollywood, news,