Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jan-2017 16:16:56
facebook Twitter Googleplus
Photo

పోయినేడాది మహేష్ బాబు పుట్టిన రోజుకు అతను హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టును ఘనంగా అనౌన్స్ చేశాడు పొట్లూరి వరప్రసాద్. కానీ ఈ ప్రాజెక్టు వ్యవహారం అనేక మలుపులు తిరిగి.. చివరికి పీవీపీ దీన్నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా దిల్ రాజు.. అశ్వనీదత్ ల చేతికి వెళ్లింది. ఐతే ఇటీవలే పీవీపీ.. వంశీ పైడిపల్లికి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కాడు. ఈ సినిమాకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టాడు. ఆ వివాదం ఏమైందో తర్వాత అప్ డేట్స్ లేవు. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే ఇప్పుడు దిల్ రాజు లైన్లోకి వచ్చాడు. వివాదం గురించి ఏమీ స్పందించకుండా ఈ సినిమా గురించి అప్ డేట్స్ మాత్రం ఇచ్చాడు.

మహేష్-వంశీ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరులో సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నట్లు దిల్ రాజు వెల్లడించాడు. 2018 వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలిపాడు. ఈ సినిమా తమ బేనర్ స్థాయికి తగ్గట్లు మంచి ఎంటర్టైనర్ అవుతుందని చెప్పాడు. అంతకుమించి రాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వివాదం గురించి స్పందించలేదు. బహుశా సెప్టెంబరులో సినిమా మొదలుపెట్టాల్సిన సమయానికి వివాదాలేమీ ఉండవని ఆశిస్తున్నట్లున్నాడు రాజు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను వచ్చే నెలలో పూర్తి చేయనున్న మహేష్.. కొరటాల శివతో సినిమాను వెంటనే మొదలుపెట్టి ఆగస్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ అంచనాతోనే రాజు.. సెప్టెంబరులో మహేష్-వంశీ సినిమా ప్రారంభోత్సవం చేసేద్దామని ఫిక్సయినట్లున్నాడు.

,  ,  ,  ,  ,