అసలు బాహుబలిః ది బిగినింగ్ సినిమా ఏ ఏరియా ఎంతకు అమ్మేశారు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ట్రేడ్ ఎనలిస్టులు కొందరు ఏది చెబితే అది మనం రాసుకోవడమే. వారు చెప్పినవే ఫిగర్లు. ఇకపోతే మేం సినిమాను ఇంతకు అమ్మేశాం ఇంత లాభాలు పొందాం అంటూ మన నిర్మాతలు కూడా ఎన్నడూ చెప్పరు. అదే సత్యం.
అయితే బాహుబలి 2 విషయంలో మాత్రం.. రెండో పార్టు నైజాం ఏరియా రైట్లను దాదాపు 45-50 కోట్లు పోసి కొన్నట్లు ఏకంగా ఒక డిస్ర్టిబ్యూషన్ సంస్థ స్వయంగా ప్రెస్ రిలీజ్ చేసింది. అదే విధంగా సినిమాను వారికే అమ్మేసినట్లు ఆఫీషియల్ ''బాహుబలి'' సోషల్ మీడియా పేజీలో కూడా ప్రకటించారు. అసలు ఏ ఏరియా విషయంలోనూ ప్రకటించని బాహుబలి నిర్మాతలు.. ఇలా నైజాం ఏరియా రైట్స్ మాత్రం పలానా వారికి అమ్మేశాం అంటూ చెప్పడం అసలు బాహుబలి1 ను రిలీజ్ చేసిన నిర్మాత దిల్ రాజును హర్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా దిల్ రాజు వంటి పంపిణీదారులు చాలా నిక్కచ్చిగా ఉంటారని టాక్. అలాంటప్పుడు ఆయన్ను కాదని బాహుబలి 2 రిలీజ్ రైట్లు వేరే వారికి ఇవ్వడం.. అలాగే ఆ విషయాన్ని పబ్లిక్ గా ప్రకటించడం.. ఏదో తేడా జరిగిందనే రూమర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.