Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jul-2015 13:15:12
facebook Twitter Googleplus
Photo

'బృందావనం', 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాల తర్వాత ఎన్టీఆర్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే ప్రకటించారు. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని దిల్ రాజు తెలిపారు. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, దర్శకుడు కొరటాల శివ 'శ్రీమంతుడు' చిత్రాన్ని చేస్తున్నాడు. 'శ్రీమంతుడు' రిలీజ్ కాగానే ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనిని దర్శకుడు శివ ప్రారంభిస్తాడు.

,  ,  ,  ,