తెలుగు సినిమాను బాహుబలి కి ముందు.. బాహుబలి కి తర్వాత అని విభజించి చెప్పొచ్చు. ఆ చిత్రం భారతీయ సినిమా ప్రమాణాల్నే ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. దీని తర్వాత వచ్చే ప్రతి భారీ సినిమానూ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ప్రేక్షకులు. బాహుబలి తో పోల్చి చూస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్టులు ప్రధానంగా సాగే సినిమాలకు బాహుబలి పెద్ద తలపోటులా తయారైంది. ఆ సినిమాతో పోల్చి చూసి.. ఏమాత్రం ప్రమాణాలు తగ్గినా తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. ఈ ఇబ్బంది గురించి అక్కినేని నాగార్జున కూడా ఓపెన్ గా మాట్లాడేశాడు. ?బాహుబలి?తో రాజమౌళి సాంకేతిక విలువల విషయంలో ప్రమాణాలు అమాంతం పెంచేశాడని.. దాన్ని అందుకోవడానికి అందరూ కష్టపడుతున్నారని నాగ్ అన్నాడు.
తన కొత్త సినిమా ?ఓం నమో వెంకటేశాయ? ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ నాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ??టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఐతే ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కు చాలా ప్రాధాన్యముంది. అందుకోసం చాలా కష్టపడుతోంది మా టీమ్. టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఈ పని పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. అదంతా చూసుకుని రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. రాజమౌళి మన సినిమా ప్రమాణాల్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. సీజీ.. వీఎఫ్ ఎక్స్ విషయంలో సిల్లీగా అనిపించకూడదని చూస్తున్నాం?? అని నాగ్ చెప్పాడు.