దిల్ రాజు బేనర్ నుంచి ఆల్రెడీ ఈ ఏడాది శతమానం భవతి.. నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇంకో నాలుగు నెలల్లోపు తన బేనర్ నుంచి ఇంకో నాలుగు సినిమాలు రిలీజవుతాయని.. ఇలా ఒక బేనర్ నుంచి ఇండియాలో ఇన్ని సినిమాలు ఒకే ఏడాది విడుదల కావడం రికార్డుగా భావిస్తున్నాని రాజు చెప్పాడు.
తన బేనర్లో సినిమాల గురించి రాజు చెబుతూ.. దువ్వాడ జగన్నాథం.. ఫిదా పూర్తి కావస్తున్నాయి. జులై లోపు ఈ రెండు సినిమాలూ రిలీజవుతాయి. రవితేజతో రాజా ది గ్రేట్ మొదలుపెట్టాం. నాని హీరోగా ఎంసీఏ స్టార్ట్ చేయాలి. ఇప్పటికే ఈ ఏడాది మా బేనర్ నుంచి స్ట్రెయిట్ మూవీస్ శతమానం భవతి.. నేను లోకల్ వచ్చాయి. రెండూ పెద్ద హిట్. ఆగస్టులోపు నాలుగు సినిమాల రిలీజ్ ప్లాన్ చేశాం. బహుశా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే బేనర్లో ఒకే ఏడాది ఆరు సినిమాలు రావడం ఇదే తొలిసారేమో. చెక్ చెయ్యాలి అని రాజు ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.
కథల ఎంపికలో.. సినిమాల జడ్జిమెంట్ విషయంలో మంచి పేరున్న దిల్ రాజు.. దర్శకత్వం జోలికి మాత్రం వెళ్లనని ఈ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. డైరెక్షన్ చెయ్యను. డైరెక్షన్ తెలియదని కాదు. కానీ చేయను. స్క్రిప్టు.. సీస్ గురించి మాత్రం డైరెక్టర్లతో చర్చిస్తాను. సినిమా రిజల్ట్ చాలావరకూ జడ్జ్ చేయగలుగుతాను