ప్రేమమ్ ముందు వరకు అక్కినేని నాగచైతన్య కెరీర్ కొంచెం డల్లుగా ఉండేది. కానీ ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఊపందుకున్నాడు చైతూ. ఒకదాని తర్వాత ఒకటి ప్రాజెక్టుల్ని లైన్లోకి పెట్టేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు నాగార్జున పెద్దకొడుకు. ఆల్రెడీ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను పూర్తి చేసిన చైతూ.. ఇటీవలే కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ అవగొట్టేశాడు. దీని తర్వాత చైతూ కోసం దర్శక నిర్మాతలు లైన్లో ఉన్నారు. ఐతే తన దగ్గరికి వచ్చిన ప్రతి ప్రాజెక్టునూ ఓకే చేసేయకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు చైతూ.
ప్రేమమ్ తో తనకు మరపురాని విజయాన్నందించిన చందూ మొండేటితోనే చైతూ తన తర్వాతి సినిమాను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చందూ.. నాగార్జున-నిఖిల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టి చైతూ-చందూ సినిమాను నాగ్ సెట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చందూతో దిల్ రాజు ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇంతకుముందే దీనిపై అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు రాజు. ఇప్పుడు చైతూ సినిమానే ఆయన టేకప్ చేసే అవకాశాలున్నట్లుగా వార్తలొస్తున్నాయి. చైతూతో ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను నిర్మించిన నేపథ్యంలో నాగ్.. ఈ చిత్రాన్ని బయటి నిర్మాతకే ఇద్దామనుకుంటున్నాడట