స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్ల కాంబినేషన్లో రూపొందుతోన్న డీజే- దువ్వాడ జగన్నాథం అనే సినిమా కొద్దికాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50%పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో దిల్రాజు నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ విడుదల తేదీకి సంబంధించిన సమాచారం అందింది.
మహా శివరాత్రి పర్వదిన కానుకగా ఫిబ్రవరి 24న డీజే ఫస్ట్ టీజర్ను విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది. అదేరోజున విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని సమాచారం. హరీష్ శంకర్ స్టైల్లోనే యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న డీజే కు అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మేజర్ హైలైట్గా నిలుస్తుందట. పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు