టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే టాలీవుడ్ మేకర్స్ కి రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. 1980ల నాటి కాలంలో హీరోయిన్స్ అంటే టీనేజ్ లో వచ్చి.. ముప్ఫై ఏళ్ల నాటికి రిటైర్ అయిపోయేవారు. అటు ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి సీనియర్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ చేసేవారు. ఇందుకు కారణం.. అప్పట్లో తాము నలుగురు ఐదుగురు హీరోయిన్లు మాత్రమే ఉండేవారమని అంటున్నారు జయసుధ.
1990ల నుంచి ట్రెండ్ మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ ను తీసుకురావడం ఎక్కువైపోయింది. ఎంతమంది నిలబడగలిగారనే మాటను పక్కన పెడితే.. వారానికో కొత్త హీరోయిన్ వచ్చేసే ట్రెండ్ కూడా నడించిందని చెప్పాలి. అయితే.. మళ్లీ ఇప్పుడు సీనియర్ భామలకు డిమాండ్ పెరుగుతోంది. థర్టీ ప్లస్ హీరోయిన్స్ ను ఆదరించేందుకు.. అవకాశాలు ఇచ్చేందుకు స్టార్ హీరోలు వెనకాడ్డం లేదు.
రీసెంట్ గా నరుడా డోనరుడా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ పల్లవి సుభాష్. ఈమె వయసు 32. తాజాగా రామ్ చరణ్ సుకుమార్ ల మూవీలో కుర్రబ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ను తీసేసి టాప్ బ్యూటీ సమంతను తీసుకున్నారు. అలాగే అనుష్క.. కాజల్.. త్రిష.. శ్రియ.. నయనతార.. శృతి హాసన్ లాంటి హీరోయిన్స్ కు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ఇదే రేంజ్ లో యంగ్ బ్యూటీస్ చేతిలో సినిమాలు ఉండండం లేదు. ఇందుకు కారణం.. మేకర్స్ మూడ్ మారిపోవడమే.
ఇప్పుడంతా మొదటివారంలో పెట్టుబడి రాబట్టుకునే రేంజ్ సినిమాకి ఉండాలి. అలా జరగాలంటే.. జనాలకు తెలిసిన డిమాండ్ ఉన్న హీరోయిన్స్ కావాలి. అందుకే కొత్తవాళ్లకు బదులుగా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్స్ ను తీసుకుంటున్నారు మేకర్స్. మరి ఈ ట్రెండ్ ఎన్నాళ్లు నడుస్తుందో చూడాలి