తెలుగులో ఇప్పుడు అన్నీ వర్గాలు ప్రేక్షకులు బాగా అలరిస్తున్న నటుడు స్టైలిష్ స్టార్. అతని దువ్వాడ జగన్నాధం సినిమా కోసం అల్లు అర్జున్ ఫాన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అంతా దాదాపుగా పూర్తి అయింది ఇంకా ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలిఉంది అని తెలుస్తుంది. ఇది కూడా రానున్న రెండు రోజులలో పూర్తి అవుతుంది అని చెబుతున్నారు.
అయితే దువ్వాడ జగన్నాధం సినిమా పాటలు పై వస్తున్న విమర్శలు ఫంక్షన్ పై పుట్టిన పుకారులు అన్నీ ఇప్పుడు మటుమాయం అయిపోతాయి అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే రేపు జరగబోయే ఆడియో ఫంక్షన్ కు వస్తున్నది ఎవరో కాదు మెగా స్టార్ చిరంజీవే. ఇప్పుడే చైనా టూర్ వెళ్ళి వచ్చిన చిరంజీవి.. అంతలోనే దువ్వాడ జగన్నాధం టీమ్ ఆహ్వానాన్ని కాదని అనలేక సరే అన్నారట. జూన్ 11 న శిల్పకళా వేదిక హైదరాబాద్ లో జరగనున్న ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిదిగా వస్తున్నారు. మెగా స్టార్ రాకతో ఈ ఈవెంట్ కు ఇప్పుడు ఉన్న దానికన్న ఇంకా క్రేజ్ పెరిగింది. చిరంజీవి తనకు నచ్చిన వాళ్ళ కోసం అదీ తన ఫ్యామిలీని హీరోల కోసం ఎప్పుడైనా ఇలాగే వచ్చేస్తారుగా.
ఇకపోతే దువ్వాడ జగన్నాధం సినిమాను డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జతగా పూజ హెగ్డే నటిస్తుంది. దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. జూన్ 23న థియేటర్లలో విడుదల కాబోతుంది.