Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2017 10:46:36
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం టీజర్ విడుదలైనప్పటి నుండి.. ఏదో ఒక రభస జరుగుతూనే ఉంది. ఈ సినిమా టీమ్ కూడా అన్నే వివాదాలును ఎదుర్కుంటోంది. మొన్న పాటలో లిరిక్స్ బ్రహ్మణులను కించపరిచే విదంగా ఉన్నాయని రచ్చ జరిగింది. అది సమసిపోయిన వెంటనే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ఈవెంట్ కోసం ఫాన్స్ కు పాసులు పంచే విషయంలో మరో వివాదం వచ్చింది.

ఫంక్షన్ కు ఇంకా ఒక రోజు దూరంలో ఉంది కానీ ఇంతవరుకు ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు ఫ్యాన్ పాసులు పంపిణీ మొదలు పెట్టలేదు. ఎప్పుడు చేస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉందటూ ఫాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరిపోదు అన్నా కూడా దిల్ రాజు ఈ విషయంపై పెద్దగా పట్టించుకుపోవడంతో వారికి కోపం వస్తోందట. అంతేకాకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పాసులు ఇచ్చి అనవసరమైన రభస ఎందుకు క్రియేట్ చేయించుకోవడం అనుకున్నారేమో.. వారికి కూడా పాసులు ఇవ్వట్లేదట. అయితే ఈ ఫంక్షన్ జరిగే స్థలంలో ఎటువంటి డూప్లికేట్ పాసులకు తావు లేకుండా బార్ కోడ్ సిస్టమ్ పెట్టారు శిల్పకళా వేదిక వాళ్ళు. ఇలాంటి సిస్టమ్ డిజే సినిమా ఫంక్షన్ కు మాత్రమే కాదు ఇంతకు ముందు అక్కడ జరిగిన పవన్ కల్యాణ్ కాటమరాయడు సినిమాకు అలాగే చాలా సినిమాలకు ఏర్పాటు చేశారు. వేదిక వద్ద గొడవలు జన హోరులో తోకిసలాట జరగకుండా ముందు జాగ్రతలు తీసుకునే వీలుపడుతుంది ఇలాంటి పద్దతి అక్కడ ఏర్పాటు చేశారట. అందుకే పాసులు ఇంకా పంపిణీ చేయలేదని టాక్.

ఈ ఫంక్షన్ కోసం అల్లు అర్జున్ ఫాన్స్ హైదరాబాద్ లో ఉన్నవారే కాకుండా ఆంధ్ర తెలంగాణ లో ఉన్న దూరపు జిల్లాలు వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళే కాకుండా కర్ణాటక కేరళ నుండి కూడా ఫాన్స్ వస్తున్నారు. వారందరికీ పాసులు అందలేదంటూ ఇప్పుడు గొడవ నడుస్తోంది.

,  ,  ,  ,  ,  ,