అందాల రాముడు, పూలరంగడు, మర్యాద రామన్న లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా బిందాస్ లాంటి కామెడీ సినిమా తీసిన వీరుపోట్ల దర్శకత్వం లో ఈడు గోల్డ్ ఎహే సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ పూర్తి చెసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ నేటినుంచి (మే 5) హైదరాబాద్ లో ప్రారంభం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో సునీల్ సరసన్ ?మాయ? ఫేం సుష్మా రాజ్, రిచా పనయ్ లు హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ మహతి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం అందిస్తుండగా ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా పై. లిమిటెడ్ బానర్ ఈ సినిమాని నిర్మిస్తున్నది.