ఈమధ్య ప్రముఖుల చేత వాయిస్ ఓవర్లు చెప్పించే ట్రెండు ఒకటి బాగా నడుస్తోంది. ఇమేజ్ వున్న వాళ్ల చేత చెప్పిస్తే తమ సినిమాకి కాస్త క్రేజ్ వస్తుందన్నది ఆయా చిత్రాల దర్శక నిర్మాతల ఉద్దేశం. తాజాగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ 'లేడీస్ & జెంటిల్మెన్' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం కాన్సెప్ట్, ట్రైలర్ తనకు బాగా నచ్చడంతో తన గొంతు ఇవ్వడానికి పూరీ ముందుకొచ్చాడు. 'కనేక్టేడ్ ఆన్ లైన్ ... డిస్ కనేక్టేడ్ ఇన్ లైఫ్' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. పీబీ మంజునాథ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
purijagannadh, voiceover, ladiesandgentleman, madhurasridhar,