Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 11:26:50
facebook Twitter Googleplus
Photo

సినిమా ప్రకటించినప్పటినుంచీ హాట్ టాపిక్ గా మారింది బాలయ్య వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి". ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాను మొదట్లో కమర్షియల్ యాక్షన్ సినిమా పొలిటికల్ బ్యాగ్రౌండ్ సినిమాగా తెరకెక్కిస్తారని భావించినా.. ఆ అవకాశం క్రిష్ కి ఇచ్చి ఒక అద్భుతమైన సినిమా ప్లాన్ చేశాడు బాలయ్య. ఇదే సమయంలో ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్నీ దర్శక నిర్మాత క్రిష్ గోప్యంగా ఉంచట్లేదు కూడా.

బాలయ్య ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వచ్చిన ఆనందంలోనో ఏమో కానీ.. ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచి ఎప్పటికప్పుడు సినిమా షూటింగ్ అప్ డేట్స్ అభిమానులకు అందిస్తూనే ఉన్నాడు క్రిష్. జార్జియాలో భారీస్థాయిలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ తో మొదలుపెడితే.. లేటెస్టుగా నదీతీరంలో చిత్రీకరించిన సన్నివేశాల వరకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది. ఈ సమయంలో రాజసూయ యాగం నేపథ్యంలో భారీ స్థాయిలో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందనే విషయం వెలుగులోకి వచ్చింది.

అఖండ భారతాన్ని ఒకేతాటిపైకి తేవడంకోసం అప్పట్లో ధర్మరాజు ఈ యాగం చేసినట్లు మహాభారతంలో పేర్కొనగా.. ఆయన అనంతరం గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ భారీయాగాన్ని చేశారట. ఈ రాజసూయ యాగ సమయంలోనే చక్రవర్తి శాతకర్ణి.. తన పేరుముందు తన తల్లి గౌతమి పేరును చేర్చుకుని "గౌతమిపుత్ర శాతకర్ణి"గా మార్చుకున్నట్లు చరిత్ర చెబుతుంది. ఈ సమయంలో ఈస్థాయి ప్రాముఖ్యమున్న సన్నివేశాన్ని బాలయ్య హేమామాలిని శ్రీయలపై మధ్యప్రదేశ్ లో చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. తన కొడుకు పుట్టిన రోజు నాడు ఈ యాగం షూటింగ్ జరగడంతో ఈ విషయాన్ని చాలా ప్రత్యేకంగా భావించిన బాలయ్య.. నిజంగానే యాగం చేసినట్లుగా దీనికి సన్నద్ధమయ్యాడట. కాగా సెప్టెంబరు 6న మొదలైన ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకు జరుగనుంది.

,  ,  ,  ,  ,