'ముకుంద' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మెగా ఫ్యామిలీ కొత్త హీరో వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో దీనిని చేయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. కాగా, ఈ చిత్రం షూటింగును ఈ నెల 27న హైదరాబాదులో ఘనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన లవ్ స్టోరీగా ఇది తెరకెక్కుతుందని సమాచారం. ఇదిలా ఉంచితే, 'బెంగళూర్ డేస్' తెలుగు రీమేక్ లో నటించడానికి కూడా వరుణ్ అంగీకారం తెలిపాడు.
varuntej, krish, tollywood, news,