Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Dec-2017 10:33:55
facebook Twitter Googleplus
Photo

గౌతమ్ వాసుదేవన్ మీనన్ కారు యాక్సిడెంట్ కు గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ లారీని వేగంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లోని షోలుంగనూర్ సిగ్నల్ వద్ద గురువారం తెల్లవారుఝామున ఉదయం 3.30 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గౌతమ్..... మహాబలిపురం చెన్నై వస్తుండగా జరిగిన ఈ ఘటనలో గౌతమ్ తో పాటు డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే వారిని హాస్పిటల్కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.

పరారీలో ఉన్న లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం జరిగినపుడు గౌతమ్ మీనన్ ఆయన డ్రైవర్ మద్యం సేవించలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగం కూడా కారణం కాదని చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విక్రమ్ హీరోగా తెరకెక్కిస్తున్న ధ్రువ నక్షత్రం సినిమా షూటింగ్ లో గౌతమ్ బిజీగా ఉన్నారు. ఆ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ - రితూ వర్మ - పార్థిపన్ నటిస్తున్నారు. వచ్చే వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇనాయ్ నోకి పాయమ్ తోటా అనే చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ధనుష్ - మేఘా ఆకాశ్ లు నటిస్తున్న ఈ చిత్రంలో రాణా అతిథి పాత్ర పోషించనున్నాడు. దక్షిణాదిలోని ప్రముఖ నటీనటులతో ఒండ్రగా అనే మల్టీస్టారర్ ను ఆయన ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,