Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:43:53
facebook Twitter Googleplus
Photo

హాలీవుడ్లో తెరకెక్కే జాంబీ సినిమాలంటే ఓ వర్గం ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. ఐతే చాలా ఏళ్ల పాటు హాలీవుడ్ కే పరిమితమైన ఈ జానర్ సినిమాలు ఇప్పుడు మన దగ్గరా తయారవుతున్నాయి. ఆల్రెడీ హిందీలో ?గో గోవా గాన్?లో జాంబీ జానర్ టచ్ చేశారు. ఇక తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలైన జయం రవి సినిమా ?మిరుదన్? కూడా ఆ జానర్లో తెరకెక్కిన పూర్తి స్థాయి ఇండియన్ మూవీ. ఆ చిత్రం తెలుగులోకి కూడా అనువాదమైంది కానీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు తెలుగులో తొలిసారిగా ఓ జాంబీ మూవీ రాబోతోంది. అదే.. ?తను వచ్చెనంట?. రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది.

ఐతే ఇది పూర్తి స్థాయి జాంబీ మూవీ కాదు. కొంచెం ఆ టచ్ ఉంటుందంతే. రెగ్యులర్ జాంబీ మూవీస్ లాగా ఇది సీరియస్ గా కూడా ఉండదు. కామెడీ ప్రధానంగా నడుస్తుందట. దీని ప్రోమోస్ చూస్తే పెద్ద ప్రయోగం లాగా ఏమీ అనిపించలేదు. మామూలు హార్రర్ కామెడీల్లాగే అనిపించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు అక్టోబరు 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చంద్రశేఖర్ ఆజాద్ నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకుడు. తేజ కాకుమాను.. ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. 21న కళ్యాణ్ రామ్ మూవీ ?ఇజం? భారీ అంచనాల మధ్య విడుదలువుతోంది. దానికి పోటీగా వస్తున్న ?తను వచ్చెనంట? ఏమాత్రం జనాల్ని ఆకర్షిస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,