సరైనోడు లో యువ ఎమ్మెల్యేగా నటించి ప్రేక్షకుల్ని అలరించిన కేథరిన్ త్వరలో గోపీచంద్తో కలిసి నటించబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. జె.పుల్లారావు, జె.భగవాన్ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా కేథరిన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. యాక్షన్కి ప్రాధాన్యమున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లబోతోంది. నిర్మాతలు మాట్లాడుతూ ??గోపీచంద్లోని మాస్ కోణాన్ని మరో కొత్త పంథాలో ఆవిష్కరించేలా కథని సిద్ధం చేశాడు దర్శకుడు. గోపీచంద్ ఇదివరకు చేసిన చిత్రాలకంటే అధిక వ్యయం, ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. కథ రీత్యా విదేశాల్లో చిత్రీకరణ జరపబోతున్నాం. త్వరలోనే ఈ చిత్రంలో నటించనున్న ఇతర తారలు, సాంకేతిక బృందం వివరాల్ని ప్రకటిస్తామ??న్నారు. ఛాయాగ్రహణం: ఎస్.సౌందర్రాజన్, కళ: ఎ.ఎస్.ప్రకాష్, కూర్పు: గౌతంరాజు, ఫైట్లు: రామ్లక్ష్మణ్.
Gopichand, Pair, Catherina, Matter, Tollywood,