రుద్రమదేవి ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్నాడు గుణశేఖర్. దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఆ చిత్రం.. భారీ నష్టాల్ని మిగల్చడంతో, గుణశేఖర్ వాటిని పూడ్చుకొనే పనిలో ఉండిపోయాడు. ఇప్పుడే.. మళ్లీ సినిమాలపై ఫోకస్పెడుతున్నాడు.
రుద్రమదేవి తరవాత ప్రతాపరుద్రుడు అనే ప్రాజెక్టు పట్టాలెక్కిద్దామనుకొన్నాడు గానీ, దానికీ భారీ బడ్జెట్ అవసరం. అందుకే? ఆ సినిమాని ఇప్పుడు తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు టాక్. ఆ స్థానంలో ఓ చిన్న సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లాలనుకొంటున్నాడట.
సొగసు చూడ తరమా లాంటి సినిమా చేయాలని.. గుణ ఎప్పటి నుంచో అనుకొంటున్నాడని, ఇప్పుడు అలాంటి కథ ఒకటి సిద్ధం చేశాడని, కొత్త తారాగణంతో ఆ సినిమాని రూపొందించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాడు గుణ. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.