ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది, తాజాగా హీరో గోపీచంద్తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్యాంకాక్లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా రెండో షెడ్యూల్ మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయింది. నవంబర్ 11నుంచి ఈ రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఇక ఈ షెడ్యూల్లోనే హీరోయిన్ హన్సిక కూడా జాయిన్ కానున్నారు.
గోపీచంద్తో కలిసి నటించనుండడం సంతోషంగా ఉందని, షెడ్యూల్ మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నానని హన్సిక అన్నారు. తన గత చిత్రాల స్టైల్లోనే కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కనుందని సంపత్ ఈ సందర్భంగా తెలిపారు. భగవాన్, జె.పుల్లారావు భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో గోపీచంద్ ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నారని సమాచారం.