హైదరాబాద్: మరికొద్ది గంటల్లో జరగబోయే సైమా 2016 కోసం సింగపూర్ ముస్తాబైంది. ఆ ముస్తాబులో ముత్యాల్లో మెరిసిపోతోంది మన తెలుగు నటీనటులు. సింగపూర్ హోటల్స్ లో మన టాలీవుడ్ సెలబ్రెటీలు ఆల్రెడీ చేస్ చేసేసారు. రెండు రోజులు పాటు జరిగే ఈ ఈవెంట్ ని అద్బుతంగా ప్లాన్ చేసారు. వారి ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే సైమా అవార్డుల వేడుక ఈసారి సింగపూర్లో జరగటం అందిరిలో ఉత్సాహం నింపుతోంది. ఈ కార్యక్రమాన్ని జూన్ 30, జులై 1న దక్షిణాది సినిమా ప్రముఖుల సమక్షంలో భారీగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా జరుగుతున్న దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన దక్షిణాది భాషలకు చెందిన ఉత్తమ కళాకారులకు అందించే సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగనుంది. సినిమా రంగానికి చెందిన 19 విభాగాల్లోని కళాకారులకు ఈ అవార్డులను అందించనున్నారు. 2015లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నారు. గురువారం, శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి పలువురు సినీ తారలు ఎంతో ఉత్సాహంగా ప్రయాణమయ్యారు. దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు ఖుష్బు, దేవిశ్రీ ప్రసాద్, శ్రుతిహాసన్, ప్రగ్యా జైశ్వాల్, సాయేషా సైగల్, హన్సిక, వేదిక, అనిరుధ్, ప్రణీత, అలీ తదితరులు సింగపూర్కు చేరుకున్నారు. ఈ విషయాన్ని సైమా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఫొటోలను పంచుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తారల స్టేజీ ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ సైమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు. సింగపూర్లోని సుంటెక్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకలో పర్ఫామ్ చేసేందుకు స్టార్స్ అంతా ఇప్పటికే సిద్ధమయ్యారు. మంచు లక్ష్మి ఈ వేడుకకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.