Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 10:20:30
facebook Twitter Googleplus
Photo

మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే... అంటూ మిర్చి సినిమాలో హంసానందినితో సందడి చేయించిన కొరటాల శివ `శ్రీమంతుడు`కి వచ్చేసరికి మాత్రం అలాంటి ఊపొచ్చే పాటని పెట్టలేకపోయాడు. అందులో ఐటెమ్ పాట బదులు రామ రామ రామ... అంటూ భక్తిగీతాన్ని వినిపించాడు. దాంతో ఐటెమ్ పాటలు కోరుకొనే మాస్ ప్రేక్షకులు కాస్త నిరుత్సాహపడిపోయారు. ఇటీవల కాలంలో ఐటెమ్ పాట కామన్ అయిపోయింది. ఆ పాటతోనే కమర్షియల్ సినిమా అనే మాటకి పరిపూర్ణత వచ్చినట్టుగా భావిస్తుంటారు. అందుకే దర్శకులకి కథానాయకులకి ఇష్టం లేకపోయినా.. నిర్మాతల బలవంతం మేరకు కొన్నిచోట్ల ఐటెమ్ పాటల్ని ఇరికించాల్సి వస్తుంటుంది. అలా బోలెడంత మంది చేశారు.

అయితే తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాకి మాత్రం ఐటెమ్ పాట కచ్చితంగా కావాలట. సన్నివేశం అంతగా డిమాండ్ చేస్తోందట. అందుకే దర్శకనిర్మాతలు ఇప్పుడు ఐటెమ్ గాళ్ ని వెదికే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ లాంటి కథానాయకుడికి ఐటెమ్ గాళ్ అంటే సమ్ థింగ్ స్పెషల్ అన్నట్టుగా ఉండాలి. అందుకే ఈసారి ఓ హీరోయిన్నే ఐటెమ్ పాటలో ఆడిపాడించేందుకు డిసైడ్ అయ్యారట. ఆ అవకాశం తమన్నాకి దక్కే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకప్పుడు హీరోయిన్లలో ఐటెమ్ పాట అంటే శ్రియ మాత్రమే గుర్తుకొచ్చేది. ఇప్పుడు తమన్నా శ్రుతిహాసన్లు మొదలుకొని బోలెడుమంది హీరోయిన్లు ఐటెమ్ పాటల్లో ఆడిపాడుతున్నారు. ఇటీవల సరైనోడు కోసం అంజలి కూడా ఐటెమ్ గాళ్ అవతారమెత్తింది. ఆమె పాట గనక తెరపై హిట్టయితే ఎన్టీఆర్ కోసం అంజలిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని మరికొద్దిమంది చెబుతున్నారు. చూద్దాం... ఎన్టీఆర్ ఎవరితో ఆడిపాడతాడో!!

,  ,  ,  ,  ,  ,