రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి ఎలాంటి అంచనాలు మధ్య రిలీజ్ అయ్యిందో , సేమ్ ఇప్పుడు జనతా గ్యారేజ్ విషయం లోను అలాగే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే 1500కు పైగా స్క్రీన్లలో రిలీజవుతుంది. తెలుగు , తమిళం , మలయాళం ఇలా ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ కావడం తో భారీ అంచనాలు నెలకొనిన్నాయి.
బాహుబలి తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజవ్వబోయే తెలుగు సినిమా ఇదే అని తెలుస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎన్నడూ లేనంత భారీగా ఈ చిత్రాన్నిరిలీజ్ చేయబోతున్నారు. ఇక నాన్నకు ప్రేమతో చిత్రం తో ఎన్టీఆర్ మార్కెట్ బాగా పెరగడం తో ఈజీ అక్కడ 250 కు పైగా థియేటర్స్ లలో రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక యూఏఈ లో దాదాపు 42 స్క్రీన్ లలో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మొత్తానికి జనతా గ్యారేజ్ అంచనాలు తగట్టే భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి ఖాయమని తెలుస్తుంది. సెప్టెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించగా మైత్రి మూవీస్ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.