ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు జరుగుతుండగా , తాజాగా ఈ చిత్ర కథ ఇదే అంటూ సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. ఈ స్టోరీ చూసినవారంతా సూపర్ గా ఉందని కామెంట్స్ వేస్తున్నారు.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి..
ముంబై లోని ఓ కాలేజీ లో కథ మొదలవుతుంది..ఓ స్టయిలిష్ బైక్ ఫై ఎన్టీఆర్ ఎంట్రీ..ఎంట్రీ తోనే ప్రణామం..ప్రణామం అనే సాంగ్ మొదలౌతుందట..ఈ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ తో అదరగొట్టాడని, అదే కాలేజీ లో ఎన్టీఆర్ తో పాటు సమంత , నిత్యా మీనన్ ,నిత్యా అన్నయ్య లు చదువుతుంటారు..
వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ ఓ సారి అంత కలిసి నేచర్ ట్రిప్ కి వెళతారు.. ఆ ట్రిప్ లో నిత్యా అన్నయ్య హత్యకు గురవుతాడు. కట్ చేస్తే హైదరాబాద్ లో మోహన్ లాల్ జనతా గ్యారేజ్ నడుపుతుంటాడు. మోహన్ లాల్ కూతురే నిత్యా అన్న విషయం ఎన్టీఆర్ కు తెలుస్తుంది. నిత్యా అన్నయ్య ఎవరు చంపారు అనేది తెలుసుకోవడానికి హైదరాబాద్ వస్తాడు ఎన్టీఆర్. హైదరాబాద్ కు వచ్చిన ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ కి సంబదించిన కొన్ని నిజాలు తెలుస్తాయి..వాటి కారణంగానే నిత్యా అన్నయ్యను చంపారని తెలుసుకుంటాడు..అయితే ఎన్టీఆర్ కు తెలిసిన ఆ నిజాలు ఏంటి..? నిత్యా అన్నయ్యను ఎవరు చంపుతారు..సమంత ఎలా ఎన్టీఆర్ ప్రేమలో పడతాడు..? అసలు మోహన్ లాల్ రోల్ ఏంటి అనేది మీరు సినిమా చూడాల్సిందే ? అంటూ ఓ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
అయితే ఈ స్టోరీ కావాలని ఎవరైనా పోస్ట్ చేసారా..? లేక ఒరిజనల్ స్టోరీ ఇదేనా అనే అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. అసలు కథ ఏంటి అనేది సెప్టెంబర్ 1 న తేలనుంది.