యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారెజ్ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమైన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా చివరి పాట షూటింగ్ జరుపుతూ వచ్చిన టీమ్, నేటితో ఆ పాట షూట్ను పూర్తి చేసి సినిమాకు ప్యాకప్ చెప్పేసింది. ఇక షూటింగ్ మొత్తం పూర్తైన విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా తెలియజేస్తూ, దర్శకుడు కొరటాల శివకు థ్యాంక్స్ తెలిపారు. ఆగష్టు 27న సినిమాను సెన్సార్కు వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు రేపట్నుంచే మొదలుపెట్టనున్నారు.
మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాగా ప్రచారం పొందుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై అంచనాలను పెంచేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించారు